న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో (Delhi) యమునా నది (Yamuna river) ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. ఎగువ నుంచి వరద (Floods) పోటెత్తడంతో ప్రమాద స్థాయిని (Danger level) మించి ప్రవహిస్తున్నది. నగరంలోని పాత రైల్వే బ్రిడ్జి (Old Railway Bridge) వద్ద 206.42 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది. హిమాచల్ప్రదేశ్ (Himachal Pradesh), ఉత్తరాఖండ్లో (Uttarakhand) భారీ వర్షాలు కురుస్తుండటంతో యమునా నదిలోకి వరద భారీగా వచ్చి చేరుతున్నది. దీంతో వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
నది మరోసారి ఉగ్రరూపం దాల్చడంతో పాత రైల్వే బ్రిడ్జిని అధికారులు మూసివేశారు. వంతెనపైకి ఎలాంటి వాహనాలను అనుమతించడంలేదు. కాగా, హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజి నుంచి 2 లక్షలకుపైగా క్యూసెక్కులకుపైగా నీటిని విడుదల చేయడంతో యమునా నది కొన్నిప్రాంతాల్లో 206.7 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది.
#WATCH | Delhi: Yamuna continues to overflow, water level crossed the danger mark yesterday
Visuals from Old Yamuna Bridge (Loha Pul) pic.twitter.com/5DCA3j7qmW
— ANI (@ANI) July 24, 2023