న్యూఢిల్లీ : కేరళలోని ఎర్నాకుళం జిల్లా కాలామస్సేరిలో (Kalamassery) ఓ కన్వన్షన్ సెంటర్లో వరుస పేలుళ్లు (Bomb Blast) సంభవించాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, 20 మందికిపైగా గాయపడ్డారు. క్రైస్తవ ప్రార్ధనలు జరుగుతున్న వేదిక వద్ద ఈ ఘటనలు జరగడంతో కలకలం రేగింది.
కేరళ వరుస పేలుళ్లతో ఢిల్లీ, ముంబైలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం (High Alert) రెండు కీలక నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు వాణిజ్య రాజధాని ముంబైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పేలుళ్ల నేపధ్యంలో నగరంలోని జనసమ్మర్ధ ప్రాంతాల్లో భద్రతను ముమ్మరం చేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
మరోవైపు ముంబైలో హై అలర్ట్ జారీ చేసిన పోలీసులు పండుగ సీజన్, రానున్న క్రికెట్ మ్యాచ్లు, కేరళ వరుస పేలుళ్ల ఘటనలతో రద్దీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కొనసాగుతున్న క్రమంలో ముంబైలోని యూధుల కేంద్రం చబాద్ హౌస్ వద్ద భద్రతను పెంచారు. ఇక ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ నిఘా వర్గాలను సంప్రదిస్తూ వచ్చిన సమాచారానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు.
Read More :
Bangladesh | హింసాత్మక నిరసనలు : బంగ్లా విపక్ష నేత అరెస్ట్