న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో విషాద ఘటన చోటుచేసుకున్నది. 21 ఏళ్ల అమ్మాయిని.. ఆమె ఫ్రెండ్ కత్తితో పొడిచాడు. ఈ ఘటన ఆదర్శనగర్ ప్రాంతంలో జరిగింది. తనతో ఫ్రెండ్షిప్ను కట్ చేసిన కోపంలో ఉన్న ఆ వ్యక్తి ఆమెను కత్తితో పొడిచాడు. సుమారు అయిదారుసార్లు కత్తితో పొడిచినట్లు తెలుస్తోంది. నిందితుడు సుఖ్విందర్ను అరెస్టు చేశారు. అతనిపై ఐపీసీ 307 కింద కేసు బుక్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఆ అమ్మాయి, అబ్బాయి మధ్య చాన్నాళ్ల నుంచి స్నేహం ఉంది. ఇటీవల సుఖ్విందర్తో ఆ యువతి మాట్లాడడంలేదు. దీంతో అతను ఆగ్రహానికి లోనయ్యాడు. కత్తితో దాడి చేసిన సుఖ్విందర్ అక్కడ నుంచి పారిపోయాడు. అంబాలాకు పరారైన అతన్ని పోలీసులు పట్టుకున్నారు. కత్తి పోట్లతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ యువతిని బాబు జగ్జీవన్ రామ్ హాస్పిటల్లో చేర్పించారు.
#WATCH | A 22-year-old youth namely Sukhvinder arrested for stabbing a girl in Adarsh Nagar area on Jan 2. Both were friends &due to some dispute, he stabbed her 3-4 times.The girl is admitted to a hospital&her condition is stable: Delhi Police
(CCTV visuals confirmed by police) pic.twitter.com/VLMvdmWGuH
— ANI (@ANI) January 4, 2023