న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ (ED) దాడులు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని సుమారు 40 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీతోపాటు పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఆయా ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఢిల్లీకి చెందిన ఈడీ అధికారులు 25 బృంధాలు ఏర్పడి బెంగళూరు, చెన్నై, నెల్లూరు, హైదరాబాద్లోని పలువురి ఇండ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు.
మూడు నెలల క్రితం మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ను ఈడీ అరెస్టు చేసింది. విచారణ సందర్భంగా ఆయన తెలిపిన సమాచారం మేరకు లిక్కర్ స్కామ్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇదే వ్యవహారంలో గత నెల కూడా వివిధ ప్రాంతాల్లో ఈడీ దాడులు చేపట్టిన విషయం తెలిసిందే.