న్యూఢిల్లీ: ఆర్థిక నేరస్తుడు సుకేష్ చంద్రశేఖర్కు ఢిల్లీ హైకోర్టు 8 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఆగస్టు 29న ఖరారు అయిన ఈ ఉత్తర్వులు సోమవారం అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీ హైకోర్టు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హర్షితా మిశ్రా ఈ తీర్పు ఇచ్చారు. ఓ క్రిమినల్ కేసులో బెయిల్ కోసం చంద్రశేఖర్ 2017 ఏప్రిల్ 28న న్యాయ అధికారి పూనమ్ చౌదరికి పదే పదే ఫోన్ చేశారు.
తాను దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అని.. తన కేసులో త్వరగా బెయిల్ ఇచ్చేలా ఆయన స్థానిక భాషలో మాట్లాడారు. న్యాయమూర్తి పదవిని అపహాస్యం చేసేలా సుకేష్ చర్యలున్నాయని, బెయిల్ను ప్రభావితం చేయడం అంటే చట్టాలను మోసం చేయడమే అని కోర్టు వ్యాఖ్యానించింది.