ఇప్పటివరకు ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని వాహనదారులకు జరిమానా విధించారు. ఇక ఇప్పుడు మాస్క్ పెట్టుకోకుండా వాహనాలు నడిపితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. కారులో మీరు ఒంటరిగా ప్రయాణిస్తున్నా సరే మాస్క్ పెట్టుకోవాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా సరే మాస్క్ లేనిదే పబ్లిక్ ప్లేసుల్లోకి రాకూడదని స్పష్టం చేసింది. ఒంటరిగా వాహనాల్లో వెళ్తున్నా మాస్కు పెట్టుకోలేదని పోలీసులు జరిమానా వేస్తున్నారంటూ ఢిల్లీకి చెందిన లాయర్ సౌరభ్ శర్మ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ప్రతిభా ఎం సింగ్ కోవిడ్ రూల్స్ తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. అంతేకాదు పోలీసులు జరిమానా వేయడాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చారు.
కారులో ఒంటరిగా ఉన్నా, ఏ వాహానంలో ఉన్నాసరే పబ్లిక్ ప్లేసుల్లోకి వచ్చేటప్పుడు మాస్క్ తప్పనిసరి అని తీర్పునిచ్చారు. ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. రోజురోజుకి లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఢిల్లీ ప్రభుత్వం కూడా రాత్రిళ్లు కర్ఫూని అమల్లోకి తెచ్చింది.
ఇవి కూడా చదవండి
వ్యాక్సినేషన్పై కేంద్రం వైఖరిని తప్పుపట్టిన రాహుల్ గాంధీ
హైదరాబాద్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన సోనుసూద్
అన్ని పార్టీలతో చర్చల అనంతరమే ఆంక్షలు : సంజయ్ రౌత్