Rahul Gandhi | న్యూఢిల్లీ: ప్రధానిపై వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై 8 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ)ని ఢిల్లీ హైకోర్టు గురువారం కోరింది. భరత్ నాగర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.
పిటిషన్లో తెలిపిన వివరాల ప్రకారం, గాంధీ గత నెల 22న ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ, ప్రధాని మోదీని జేబు దొంగ అని ఎద్దేవా చేశారు. ఆయనకు ఈసీ గత నెల 23న నోటీసు ఇచ్చి, గత నెల 26లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ గడువు ముగిసినప్పటికీ ఆయనపై ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.