న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. లిక్కర్ కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. అయితే జైలు నుంచే ఆయన ప్రభుత్వ ఆదేశాలను జారీ చేస్తున్నారు. దీన్ని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా(Lieutenant Governor V K Saxena) తప్పుపట్టారు. జైలు నుంచి ఢిల్లీ సర్కార్ను నడపలేరని ఆయన అన్నారు. జైలు నుంచి ప్రభుత్వ పాలనను కేజ్రీవాల్ కొనసాగిస్తారని ఆమ్ ఆద్మీ నేతలు ప్రకటన చేస్తున్న నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21 తేదీన అరెస్టు చేశారు. మార్చి 28వ తేదీ వరకు ఆయన ఈడీ కస్టడీలో ఉండనున్నారు. అయితే ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆ రాష్ట్ర గవర్నర్ సక్సేనా.. జైలు నుంచి సర్కారును నడపకుండా ఉండేందుకు ప్రయత్నిస్తానని ఢిల్లీ ప్రజలకు హామీ ఇస్తున్నట్లు చెప్పారు.