న్యూఢిల్లీ, మార్చి 7: మద్యం పాలసీ కేసులో తాము జారీ చేసిన సమన్లకు స్పందించడం లేదని ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీచేసింది. ఈ నెల 16న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.
నాలుగు నుంచి ఎనిమిదో సమన్ల వరకు ఈడీ ఈ ఫిర్యాదు చేసింది. తొలి మూడు సమన్లకు సంబంధించి ఈడీ ఇదివరకే కోర్టులో ఫిర్యాదు చేసింది. మొత్తంగా ఇప్పటివరకు కేజ్రీవాల్కు ఈడీ ఎనిమిది సార్లు సమన్లు పంపింది. అవి చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఆయన విచారణకు హాజరుకావడం లేదు.