ధర్మసాగర్, మే 21: కొవిడ్పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే రాజయ్య సూచించారు. మండలంలోని పెద్దపెండ్యాలలో శుక్రవారం ఎంపీపీ నిమ్మ కవిత ప్రత్యేక చొరవతో గ్రామంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేయగా, ఆయన ప్రారంభించి, వైద్యు లు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్న తీరును పరిశీలించారు. కరోనా బాధితుల ధైర్యంగా ఉంటూ వైద్యుల సలహాలు సూచనలు పాటించాలని తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నియయంత్రణలో భాగస్వా ములవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మ కవిత, సర్పంచ్ ఆకారపు అన్నమ్మ, ఎంపీటీసీ ఏ నాగయ్య, ఉప సర్పంచ్ శివాకర్ రెడ్డి, గ్రామస్తులు లక్ష్మీనారాయణ, గంగాధర్రెడ్డి, శివాకర్ రెడ్డి, టీ చిరంజీవి, రవీంద్రారెడ్డి, సీహెచ్వో నెహ్రూనాయక్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.