న్యూఢిల్లీ, జనవరి 27: ఉద్యోగాలకు భూమి కుంభకోణం మనీలాండరింగ్ కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి, ఆమె కుమార్తెలు మీసా భారతి, హేమా యాదవ్లకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 9న కోర్టు ముందు హాజరు కావాలని జడ్జి విశాల్ శనివారం ఆదేశించారు. ఈడీ చార్జిషీట్ను పరిగణనలోకి తీసుకొన్న న్యాయస్థానం ఈ మేరకు సమన్లు జారీ చేసింది.
ఈ కేసులో విచారణ ముందుకు సాగేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు ఈ సందర్భంగా పేర్కొన్నది. బీహార్లో రాజకీయ సంక్షోభం నెలకొన్న సమయంలో లాలూ కుటుంబ సభ్యులకు సమన్లు జారీ కావడం ప్రాధాన్యత సంతరించుకొన్నది.