న్యూఢిల్లీ: రెండు కోట్ల ఆదాయంపై ఐటీఆర్ దాఖలు చయలేదని ఓ మహిళలకు ఢిల్లీ కోర్టు(Delhi court) ఆరు నెలల జైలుశిక్ష విధించింది. ఇన్కంట్యాక్స్ ఆఫీసు నమోదు చేసిన ఓ ఫిర్యాదుపై కోర్టు ఆ తీర్పును ఇచ్చింది. 2013-14 ఆర్థిక సంవత్సరం రెండు కోట్ల ఆదాయంపై రెండు లక్షలు పన్ను వసూల్ చేశామని, అయితే 2014-15 సంవత్సరానికి ఎటువంటి రిటర్న్స్ దాఖలు చేయలేదని ఇన్కంట్యాక్స్ ఆఫీసు ఆరోపించింది.ఈ కేసులో వాదనలు విన్న అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మయాంక్ మిట్టల్.. నిందితురాలు సావిత్రికి జైలుశిక్ష విధించారు. నిందితురాలికి ఆరునెలల జైలుశిక్షతో పాటు 5వేల జరిమానా విధిస్తున్నట్లు ఏసీఎఎం మిట్టల్ తెలిపారు. అయితే కోర్టులో కేసును సవాల్ చేసేందుకు 30 రోజుల పాటు బెయిల్ కూడా మంజూరీ చేశారు.