న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్నారు. జైన్ మనీలాండరింగ్కు పాల్పడ్డారంటూ గతంలో ఈడీ ఆయనను అరెస్ట్ చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో సత్యేందర్ జైన్ ఢిల్లీ కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేశారు.
జైన్ బెయిల్ పిటిషన్పై విచారణ పూర్తిచేసిన ఢిల్లీ కోర్టు తీర్పును రిజర్వ్లో పెట్టింది. ఈ నెల 16న (బుధవారం) ఈ పిటిషన్పై కోర్టు తీర్పు వెల్లడించే అవకాశం ఉంది.