న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక జడ్జి మే 7 వరకు పొడిగించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేసిన సీబీఐ, ఈడీ వ్యవహారాల జడ్జి కావేరీ బవేజా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంతో కేజ్రీవాల్కు తక్కువ డోస్ ఇన్సులిన్ ఇచ్చినట్టు తీహార్ జైలు అధికారులు వెల్లడించారు. అయితే గతంలో ఇన్సులిన్ అవసరం లేదన్నవారు ఇప్పుడు ఎందుకిచ్చారని ఆప్ ప్రశ్నించింది.