Parliament security breach | న్యూఢిల్లీ : పార్లమెంట్లో లోపల, బయట కలర్ స్మోక్ వదిలి నానా హంగామా సృష్టించిన నలుగురు నిందితులకు ఢిల్లీ కోర్టు పోలీసు కస్టడీ పొడిగించింది. సాగర్ శర్మ, మనోరంజన్, నీలం దేవి, అమోల్ షిండేకు జనవరి 5వ తేదీ వరకు పోలీసు కస్టడీని పొడిగిస్తున్నట్లు స్పెషల్ జడ్జి హర్దీప్ కౌర్ తెలిపారు.
ఈ నలుగురు నిందితుల నుంచి పోలీసులు కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. మనోరంజన్ స్నేహితుడు సాయికృష్ణను ఇవాళ ఉదయం కర్ణాటకలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రధాన వ్యూహకర్త లలిత్ ఝా కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడు.
సాగర్ వర్మ, మనోరంజన్ లోక్సభలో కలర్ స్మోక్ వదిలి ఎంపీలను భయాందోళనకు గురి చేసిన సంగతి తెలిసిందే. నీలం దేవి, అమోల్ షిండే పార్లమెంట్ బయట ఎల్లో స్మోక్ వదిలి హంగామా సృష్టించారు.