న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ ఢిల్లీలోని ఎన్ఐఏ కోర్టు దోషిగా తేల్చింది. అయితే ఈ కేసులో మే 25వ తేదీన శిక్షను ఖరారు చేయనున్నారు. మాలిక్ ఆర్థిక పరిస్థితిని ఎన్ఐఏ అంచనా వేయనున్నది. తనకు ఉన్న ఆస్తులపై అఫిడవిట్ను సమర్పించాలని మాలిక్ను కోర్టు ఆదేశించింది. మాలిక్తో పాటు షబ్బీర్ షా, రషీద్ ఇంజినీర్, అల్తాప్ ఫంతూష్, మస్రాత్లకు ఉగ్ర నిధులు అందినట్లు విచారణలో తేలింది. జమ్మూకశ్మీర్లో సంఘ విద్రోహ కార్యకలాపాలు నడిపేందుకు నిధులు సమీకరించినట్లు యాసిన్ మాలిక్పై ఆరోపణలు ఉన్నాయి. నేరాభియోగం నమోదైన నేపథ్యంలో మాలిక్ క్షమించాలని కోరారు.