Swati Maliwal | ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ (Delhi Womens Panel Chief) స్వాతి మలివాల్ (Swati Maliwal) భావోద్వేగానికి గురయ్యారు. తోటి ఉద్యోగులను హత్తుకొని ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. స్వాతి మలివాల్ను ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) రాజ్యసభ (Rajya Sabha) అభ్యర్థిగా నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వాతి.. డీసీడబ్ల్యూ పదవికి రాజీనామా (resign) చేశారు. రాజీనామా అనంతరం తన చాంబర్లో తోటి ఉద్యోగులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆమె ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.
#WATCH | Delhi Commission for Women (DCW) Chief Swati Maliwal resigns from her post after being nominated for Rajya Sabha by Aam Aadmi Party (AAP). pic.twitter.com/yp19yGcqeT
— ANI (@ANI) January 5, 2024
ఈ ఏడాది ఏకంగా 68 రాజ్యసభ ఎంపీ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. రాజ్యసభ పదవీకాలం పూర్తికానున్న నేతల్లో పలువురు కేంద్రమంత్రులు, కీలక నేతలు ఉన్నారు. అందులో ఢిల్లీలోని మూడు రాజ్యసభ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆప్ నేతలు సంజయ్ సింగ్, నరైన్ దాస్ గుప్తా, సుశీల్ కమార్ గుప్తాలు కూడా ఉన్నారు. ఈ ముగ్గురు నేతల ఆరేళ్ల పదవీ కాలం ఈ నెల 27తో ముగియనుంది. దీంతో వీటికి నోటిఫికేషన్ విడుదలైంది. ఢిల్లీతో పాటు ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 19వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికలకు ఆప్ ముగ్గురు అభ్యర్థులను నామినేట్ చేసింది. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్, ప్రస్తుతం రాజ్యసభ ఎంపీలుగా పదవీ విరమణ చేయనున్న ఆప్ నేతలు సంజయ్ సింగ్, నరైన్ దాస్ గుప్తాలను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ (political affairs committee) శుక్రవారం ప్రకటించింది. ‘డీసీడబ్ల్యూ చైర్పర్సన్ స్వాతి మలివాల్ మొదటిసారిగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సంజయ్ సింగ్, నరైన్ దాస్ గుప్తాలను రెండోసారి కూడా రాజ్యసభ సభ్యులుగా కొనసాగించాలని పీఏసీ నిర్ణయించింది’ అని ఆప్ తెలిపింది.
Also Read..
JN.1 | 600 మార్క్ను దాటిన జేఎన్.1 కేసులు.. కర్ణాటకలో అత్యధికం
Polar Bear | బర్డ్ఫ్లూతో ధ్రువపు ఎలుగుబంటి మృతి.. ప్రపంచంలోనే తొలికేసు
Hindu Temple | మరోసారి రెచ్చిపోయిన తీవ్రవాదులు.. హిందూ ఆలయంపై ఖలిస్తానీ అనుకూల రాతలు