న్యూఢిల్లీ : ఢిల్లీ జల్ బోర్డ్(డీజేబీ)కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సోమవారం ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. చట్ట విరుద్ధంగా ఈడీ నోటీసులు జారీచేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సందర్భంగా మండిపడింది.
ఎన్నికల్లో ప్రచారం చేయకుండా కేజ్రీవాల్ను కేంద్రంలోని అధికార బీజేపీ టార్గెట్ చేసిందని ఆరోపించింది. కాగా, ఆప్ నేత సత్యేందర్ జైన్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిలు పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.