ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని సీఎం స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ తేలిందని కేజ్రీవాల్ తెలియజేశారు. తనకు తక్కువ స్థాయిలో మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే ఉన్నాయని వివరించారు.
కరోనా పాజిటివ్ అని తేలడంతో వెంటనే ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లినట్లు కేజ్రీవాల్ చెప్పారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. ఈ విషయం తెలిసిన కేజ్రీవాల్ అభిమానులు.. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కారణంగా నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ఇక్కడ కరోనా కేసులు వేగంగా వ్యాపిస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.