న్యూఢిల్లీ, మే 28: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం పరామర్శించారు. ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ దవాఖానలో జైన్ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి వాకబు చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం జైన్ను ప్రశంసిస్తూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. తానొక ధైర్యవంతుడు, హీరోను కలిశానని చెప్పారు. సత్యేందర్ జైన్ ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.