ఖమ్మం, ఏప్రిల్ 5:నూతన సీపీ విష్ణు ఎస్.వారియర్ సోమవారం రాత్రి ఖమ్మం నగరంలోని ఉమేశ్చంద్ర భవన్ పోలీస్గెస్ట్ హౌస్కు చేరుకొని రిపోర్ట్ చేశారు.
ఖమ్మం పోలీస్ కమిషనర్గా విష్ణు ఎస్ వారియర్ (ఐపీఎస్) రిపోర్ట్ చేశారు. సోమవారం రాత్రి ఖమ్మం నగరంలోని ఉమేశ్ చంద్ర భవన్ పోలీస్ గెస్ట్హౌస్కు చేరుకొని రిపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా డీసీపీలు మురళీధర్, ఇంజారపు పూజ, ఏడీసీపీ కుమారస్వామి, ఎల్సీ నాయక్, ప్రసాద్లు నూతన సీపీకి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. వీరితోపాటు ఏసీపీలు ప్రసన్నకుమార్, ఆంజనేయులు, వెంకటరెడ్డి, వెంకటేశ్, సత్యనారాయణ, వెంకట్రావు, సంపత్కుమార్, వెంకటస్వామి, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, సీఐలు, ఆర్ఐలు తదితరులు ఉన్నారు.