అహ్మదాబాద్ : గుజరాత్ హైకోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని నరేంద్రమోదీ విద్యార్హతలకు సంబంధించి గతంలో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పునర్విచారణ జరపాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను కొట్టివేసింది.
ప్రధాని ఎంఏ డిగ్రీకి సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని గుజరాత్ యూనివర్సిటీకి కేంద్ర సమాచర కమిషన్ (సీఐసీ) ఇచ్చిన ఆదేశాన్ని జస్టిస్ వైష్ణవ్ రద్దు చేయడమే కాక, ఈ కేసులో పిటిషనర్ అరవింద్ కేజ్రీవాల్కు రూ.25 వేల జరిమానా కూడా విధిస్తూ మార్చిలోనే తీర్పు చెప్పారు. దీనిపై కేజ్రీవాల్ రివ్యూ పిటిషన్ను కొట్టివేస్తున్నట్టు జస్టిస్ వైష్ణవ్ గురువారం తీర్పు చెప్పారు.