న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నెల 4న సీఎం కేజ్రీవాల్కు కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆయన అప్పటినుంచి హోం ఐసోలేషన్లో ఉన్నారు. తనకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని చెప్పారు. అయితే తాజాగా తాను కరోనా నుంచి కోలుకున్నాని స్వయంగా ప్రకటించారు. ఈమేరకు ఆదివారం ఉదయం ట్వీట్ చేశారు.
పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ పలు ర్యాలు, సభల్లో పాల్గొన్నారు. దీంతో ఆయన కరోనా బారిన పడ్డారు. గత మంగళవారం పాజిటివ్గా నిర్ధారణ కావడంతో స్వీయ నిర్భందంలోకి వెళ్లారు.
దేశరాజధాని ఢిల్లీలో శనివారం 20,181 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 15,26,979కి చేరాయి. ఇందులో 14,53,658 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 48,178 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 25,143 మంది వైరస్ వల్ల మరణించారు. కాగా, దేశంలో కొత్తగా 1,59,632 కేసులు నమోదయ్యాయి.