న్యూఢిల్లీ, మార్చి 21: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేయడంపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరుపనుంది. కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆయన తరఫు న్యాయవాదులు గురువారం రాత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద ఈడీ అరెస్టును సవాలు చేసిన న్యాయవాదులు తమ పిటిషన్పై అత్యవసరంగా విచారణ జరపాలని రిజిస్ట్రీకి విజ్ఞప్తి చేశారు. అర్థరాత్రి అయినా విచారణ జరపాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు కోరారు. అయితే పిటిషన్ను స్వీకరించిన రిజిస్ట్రీ దానిపై శుక్రవారం విచారణ జరుపుతామని సమాచారమిచ్చింది.