అహ్మదాబాద్: గుజరాత్ విశ్వవిద్యాలయం దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్కు ఎదురుదెబ్బ తగిలింది. తాను పబ్లిక్ సర్వెంట్నని, తనను విచారించాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలని కేజ్రీవాల్ వాదించారు.
ఈ వాదనను అహ్మదాబాద్ కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఈ కేసులో విచారణను కొనసాగించవచ్చునని చెప్తూ ఈ నెల 28కి వాయిదా వేసింది. ప్రధాని మోదీ డిగ్రీకి సంబంధించిన కేసులో గుజరాత్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆదేశాలను ఆ రాష్ట్ర హైకోర్టు గతంలో తోసిపుచ్చింది. అనంతరం కేజ్రీవాల్, ఆప్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, గుజరాత్ విశ్వవిద్యాలయంపై వ్యాఖ్యలు చేశారు.