న్యూఢిల్లీ, మే 26: జాతీయ రహదారులపై టోల్ప్లాజాల దగ్గర వాహనాల రద్దీని పూర్తిగా తగ్గించడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఐఏ) బుధవారం పలు కీలక ఆదేశాలను జారీచేసింది. టోల్ గేట్ వద్ద ఒక వాహనం 10 సెకన్లకు మించి ఆగకూడదని స్పష్టం చేసింది. ప్లాజా వద్ద వాహనాల క్యూలైను ఎట్టి పరిస్థితుల్లోనూ 100 మీటర్లకు మించకూడదని ఆదేశించింది. ఫాస్టాగ్తో వాహనాల రద్దీ బాగా తగ్గిందని తెలిపింది.