న్యూఢిల్లీ: మత మార్పిడి కార్యక్రమానికి హాజరైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రి గౌతమ్ రాజీనామా చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆదివారం పేర్కొన్నారు. ‘ఈరోజు మహర్షి వాల్మీకి జయంతి. మరోవైపు మాన్యవర్ కాన్షీరామ్ సాహెబ్ వర్ధంతి కూడా. అలాంటి రోజున యాదృచ్ఛికంగా నేను అనేక సంకెళ్ల నుంచి విముక్తి పొందాను. ఈ రోజు నేను మళ్లీ జన్మించాను. ఇప్పుడు నేను ఎలాంటి ఆంక్షలు లేకుండా మరింత దృఢంగా సమాజం హక్కులు, దౌర్జన్యాలపై పోరాడతా’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. మంత్రి పదవికి చేసిన రాజీనామా లేఖను కూడా అందులో పోస్ట్ చేశారు.
కాగా, ఢిల్లీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్, శుక్రవారం జరిగిన ఒక మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందలాది మంది బౌద్ధ మతాన్ని స్వీకరించారు. హిందూ దేవుళ్లను ఇకపై దేవతలుగా పరిగణించబోమని వారు అన్నారు.
మరోవైపు ఆప్ మంత్రి గౌతమ్ ఈ మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొనడంపై బీజేపీ విమర్శించింది. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను డిమాండ్ చేసింది. గుజరాత్ ఎన్నికల ప్రచారం సందర్భంగా కేజ్రీవాల్కు వ్యతిరేకంగా పోస్టర్లు కూడా ఏర్పాటు చేసింది. ఈ వివాదం నేపథ్యంలో రాజేంద్ర పాల్ గౌతమ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
आज महर्षि वाल्मीकि जी का प्रकटोत्सव दिवस है एवं दूसरी ओर मान्यवर कांशीराम साहेब की पुण्यतिथि भी है। ऐसे संयोग में आज मैं कई बंधनों से मुक्त हुआ और आज मेरा नया जन्म हुआ है। अब मैं और अधिक मज़बूती से समाज पर होने वाले अत्याचारों व अधिकारों की लड़ाई को बिना किसी बंधन के जारी रखूँगा pic.twitter.com/buwnHYVgG8
— Rajendra Pal Gautam (@AdvRajendraPal) October 9, 2022