న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) చేపట్టిన పలు ప్రాజెక్టులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫలితం గా ఆయా ప్రాజెక్టులకు అనుకొన్న వ్యయం కంటే అధికంగా నిధులు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం డీఆర్డీవో 55 మిషన్ మోడ్ ప్రాజెక్టులపై పనిచేస్తుండగా.. వాటిలో దాదాపు సగం ప్రాజెక్టులు షెడ్యూల్ సమయం కంటే వెనుకబడ్డాయి. ఈ మేరకు రాజ్యసభలో ఓ ప్రశ్నకు రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్భట్ సోమవారం సమాధానం ఇచ్చారు. ఈరోజుటి వరకు డీఆర్డీవో 55 మిషన్ మోడ్ ప్రాజెక్టులపై పనిచేస్తుండగా.. అందులో 23 ప్రాజెక్టులు ఆలస్యంగా నడుస్తున్నాయని తెలిపారు. ఈ 55 ప్రాజెక్టుల్లో 12ప్రాజెక్టుల వ్యయం పెరిగిందని చెప్పారు.