దేశంలో పలు ప్రాంతాల్లో హఠాత్తుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. దీంతో మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో డీహైడ్రేషన్కు గురి కాకుండా ఉండటానికి, ఎండ తీవ్రత బారిన పడకుండా ఉండటానికి పోషకాహార నిపుణులు, వైద్యులు కొన్నిసూచనలు చేస్తున్నారు.
అధిక ప్రోటీన్లు కలిగిన ఆహారం, కాఫీ, టీ, సాఫ్ట్ డ్రింకులు శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తాయని, డీహ్రైడ్రేషన్కు కారణమవుతాయని నిపుణులు తెలిపారు. శరీరంలో వేడిని తగ్గించుకోవాలంటే అధిక ఎలక్ట్రోలైట్లు కలిగిన నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. – నేషనల్ డెస్క్