హైదరాబాద్ : భారతదేశంలో సమగ్రమైన వ్యవసాయ సేవలను రైతులకు అందించే అగ్రిటెక్ ప్లాట్ఫామ్ ప్లాట్ ఫామ్ డీహాత్ సిరీస్ డీ ఫండింగ్ రౌండ్లో 115 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించినట్లు ప్రకటించింది. ఈ రౌండ్కు బెల్జియం కేంద్రంగా ఉన్న ఇన్వెస్ట్మెంట్ సంస్ధ సోఫినా అండ్ లైట్రాక్ ఇండియా నేతృత్వం వహించాయి. ఈ రౌండ్లో టెమాసెక్ కూడా పెట్టుబడులు పెట్టగా.. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన ప్రోసస్,ఆర్టీపీ గ్లోబల్, సీక్వోయా క్యాపిటల్ ఇండియా,ఎఫ్ఎంఓలు సైతం ఈ రౌండ్లో పాల్గొన్నాయి. డెక్ట్సర్ క్యాపిటల్,వెర్టిసెస్ పార్టనర్స్ ఈ ఫండింగ్ రౌండ్కు ఎడ్వైజర్లుగా వ్యవహరించాయి.
డీ హాత్ సీఈవో,కో-ఫౌండర్ శశాంక్ కుమార్ మాట్లాడుతూ ‘‘ప్రపంచంలో అతిపెద్ద అగ్రిటెక్ వేదికను నిర్మించాలనే లక్ష్యంతో డీహాత్ ద్వారా మేము కృషి చేస్తున్నాం. గత 30 నెలల్లో భారీ మదుపరుల నుంచి 157 మిలియన్ డాలర్లను సమీకరించాం. మా బృందం ఇప్పుడు 850కు పైగా ప్రొఫెషనల్స్కు చేరింది. గత ఏడు నెలల్లో ఐదురెట్ల వృద్దిసాధించింది. అందుకోసమే మేము రాబోయే 12–15 నెలల్లో అన్ని ప్రధాన వ్యవసాయ క్లస్టర్లలోనూ ఇదేరకమైన వృద్ధిని సాధించాలనుకుంటున్నాం’’ అనితెలిపారు.