Chief Marshal VR Chaudhary | భారత వైమానిక దళాన్ని ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ చీఫ్ వివేక్ రామ్ చౌదరి ప్రశంసించారు. సూడాన్లో వాడి సిడ్నా రెస్క్యూ ఆపరేషన్ను అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో వైమానిక దళం సామర్థ్యాన్ని ప్రదర్శించిందని కొనియాడారు. ఈ మిషన్ను అమలు చేసిన ఎయిర్క్రూను ఆయన అభినందించారు. సమయం వచ్చినప్పుడల్లా మన సత్తాను చాటుతామని జాతికి భరోసా ఇవ్వాలనుకుంటున్నామన్నారు.
సూడాన్ నుంచి భారతీయులను తరలించేందుకు ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరి’ని విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. భారత వైమానిక దళం సూడాన్లో అత్యంత ప్రమాదకరమైన మిషన్ చేపట్టింది. ఈ నెల 27 -28 రాత్రి సూడాన్లో సాహసోపేతమైన ఆపరేషన్లో వైమానిక దళానికి చెందిన C-130J విమానం వాడి సిద్నాలోని చిన్న ఎయిర్స్ట్రిప్ నుంచి 121 మందిని విజయవంతంగా రక్షించింది. ఈ సందర్భంగా ఏరోస్పేస్ ఫోర్స్లో ప్రైవేట్ రంగం భవిష్యత్తుపై వీఆర్ చౌదరి మాట్లాడుతూ. గత రెండేళ్లలో విడుదల చేసిన కొత్త విధానాల ద్వారా అంతరిక్షంలో ప్రజాస్వామికీకరణ మన పర్యావరణంలో జరిగిన భారీ విప్లవమన్నారు.