న్యూఢిల్లీ: రూ.84,560 కోట్ల వ్యయంతో ఆయుధ వ్యవస్థను సమకూర్చుకునేందుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. సముద్రంపై నిఘా, మల్టీ మిషన్ విమానాలు, అత్యాధునిక యాంటీ ట్యాంక్ మైన్స్ తదితర ఆయుధ సంపత్తిని కొనుగోలు ప్రతిపాదనలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో డిఫెన్స్ అక్వైజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఆమోద ముద్ర వేసింది.
ఈ ప్రతిపాదనలో ఎయిర్ డిఫెన్స్ టాక్టికల్ కంట్రోల్ రాడార్, కల్వరి క్లాస్ సబ్ మెరైన్స్ కోసం టార్పిడోలు, గాల్లోనే ఇంధనాన్ని నింపే విమానాలు, సాఫ్ట్ వేర్ ఆధారిత రేడియోలు ఉన్నాయి.