Chiranjeevi | ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) కన్నుమూసిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. వామపక్ష నేత మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సైతం ఏచూరి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రయాణంలో ఉన్న సీతారాం ఏచూరి మరణ వార్త తనను తీవ్ర మనోవేదనకు గురి చేసిందన్నారు. విద్యార్థి కార్యకర్తగా ప్రారంభించినప్పటి నుంచి ఆయన ఎల్లప్పుడూ అణగారిన, సామాన్య ప్రజల గొంతుగా ఉండేందుకు కృషి చేశారన్నారు. ఈ మేరకు ఏచూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, సీపీఎం వర్గానికి చిరంజీవి సానుభూతి వ్యక్తం చేశారు. ప్రజా సేవ, దేశం పట్ల ఆయన చూపిన నిబద్ధత ఎల్లప్పుడూ గుర్తుండి పోతుందని ఈ సందర్భంగా మెగాస్టార్ కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్టు పెట్టారు.
Deeply distressed by the news of the passing of Shri Sitaram Yechury, a veteran leader with over five decades of political journey and a tall leader of the CPM. Since starting as a student activist,
Shri Yechuri had always strived to be the voice of the downtrodden and common…— Chiranjeevi Konidela (@KChiruTweets) September 13, 2024
Also Read..
Team India: బంగ్లాతో టెస్టు సిరీస్.. చెన్నైలో టీమిండియా ప్రిపరేషన్ షురూ
BRS | అక్రమ అరెస్టులపై భగ్గుమన్న బీఆర్ఎస్.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు : ఫొటోలు
Chatrapathi Movie | ‘ఛత్రపతి’ ఇంటర్వెల్ సీన్.. అసలు సీక్రెట్ బయటపెట్టిన ప్రభాస్.!