న్యూఢిల్లీ, నవంబర్ 25: దేశంలో రాజ్యాంగ విలువలు రోజురోజుకూ దిగజారుతున్నాయని, వాటి పరిరక్షణలో అధికార బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని పలువురు విపక్ష నేతలు విమర్శించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రాజ్యాంగ సం స్థల స్వతంత్రతను, వృత్తి సంబంధ స్వయంప్రతిపత్తిని మోదీ ప్రభుత్వం పూర్తిగా తుడిచిపెట్టేసిందని, అంతేకాకుండా రాజ్యాంగాన్ని తిరగరాయాలని వాదిస్తున్నదని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ విమర్శించారు. విభజన, విద్వేషంపై కాంగ్రెస్ ముందుండి పోరాడుతుందని పీసీసీ చీఫ్ ఖర్గే తెలిపారు. ప్రజాస్వామ్య మూలాలపై దాడి చేస్తూ దానిని బలహీనపర్చడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆప్ నేత గోపాల్ రాజ్ విమర్శించారు. దేశంలో ఏకపార్టీ విధానం వైపు తీసుకెళ్లడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. రాజ్యాం గం గొప్పతనం గురించి బీజేపీ ఒక్క రోజు మాత్రమే మాట్లాడుతుందని, మిగిలిన ఏడాదంతా దానిని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుందని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది విమర్శించారు.