న్యూఢిల్లీ : మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్కు రెండు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఒకటి ఐఎస్ఐఎస్ కశ్మీర్ నుంచి రాగా, మరొకటి పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. కరాచీలోని సింధ్ యూనివర్సిటీ నుంచి మెయిల్ వచ్చినట్లు ఢిల్లీ పోలీసుల ద్వారా తెలిసింది. షాహీద్ హమీద్ అనే యువకుడు.. గంభీర్కు మెయిల్ పంపినట్లు పేర్కొన్నారు.
గంభీర్ను ఆయన కుటుంబ సభ్యులను చంపుతామంటూ ఐఎస్ఐఎస్ కశ్మీర్ సంస్థ నుంచి మంగళవారం రాత్రి తొలి మెయిల్ వచ్చింది. అనంతరం బుధవారం మరో మెయిల్ వచ్చింది. ‘నిన్ను చంపాలనుకున్నాం. నిన్న బతికిపోయావ్. బతుకుమీద ఆశ ఉంటే రాజకీయాలను, కశ్మీర్ అంశాన్ని వదిలెయ్’ అని మెయిల్లో బెదిరించారు. దీంతో ఢిల్లీలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు భద్రతను పెంచారు.