గాంధీనగర్, మార్చి 13: ఆస్ట్రేలియాకు చెందిన డియాకిన్ విశ్వవిద్యాలయం తన మొదటి విదేశీ క్యాంపస్ను గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ప్రారంభించింది. భారత్లో ఒక విదేశీ వర్సిటీ తన బ్రాంచ్ ప్రారంభించడం ఇదే ప్రథమం. ఆస్ట్రేలియా ప్రధాని అంథోనీ అల్బనీస్ ఈ శాఖను ప్రారంభించారు. ‘భారత్లో, భారత్తో, భారత్ కోసం’ అనే తాత్వికతతో ఈ శాఖను ప్రారంభించినట్టు వర్సిటీ తెలిపింది. ‘ఇది నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం. ఇది ఒక విజయం. బలమైన విద్యా, వ్యాపార, సాంస్కృతిక సంబంధాలకు ఇది ఆరంభం’ అని అల్బనీస్ పేర్కొన్నారు.