ముంబై : ప్రముఖ టీవీ యాంకర్ అర్నాబ్ గోస్వామి, నటి కంగనా రనౌత్పై శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ నోటీసుపై ప్రివిలేజెస్ కమిటీ నివేదిక సమర్పించేందుకు గడువును మహారాష్ట్ర శాసనసభ తదుపరి సమావేశాల చివరి రోజు వరకు పొడిగించారు. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని మంగళవారం అసెంబ్లీలో కమిటీ చైర్మన్ దిరాక్ కేసర్కార్ ప్రవేశపెట్టగా.. సభ ఆమోదించింది.
సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు పలువురిని అవమానించడంతో పాటు ప్రత్యేక హక్కును ఉల్లంఘించినందుకు గోస్వామి, కంగనాపై ప్రతాప్ సర్నాయక్ గతేడాది సెప్టెంబర్ 7న ప్రివిలేజ్ నోటీసు జారీ చేశారు. అర్నాబ్ గోస్వామి సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్పై నిరాధారమైన వ్యాఖ్యలు చేశారని, అవమానకరమైన పదజాలాన్ని ఉపయోగించారని సర్నాయక్ ఆరోపించారు.