ముంబై : ఓ కస్టమర్ చికెన్కు ఆర్డరివ్వగా అందులో చనిపోయిన ఎలుక కనిపించిన ఘటన ముంబై బాంద్రాలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి కస్టమర్ ఫిర్యాదు ఆధారంగా రెస్టారెంట్ మేనేజర్, చెఫ్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
బాంద్రా వెస్ట్లోని పాలిహిల్లో భోజనం చేసేందుకు ఫ్రెండ్తో కలిసి అనురాగ్ సింగ్ వెళ్లాడు. వారు చికెన్, బ్రెడ్తో మటన్ తాలి ఆర్డర్ చేశారు. తమకు సప్లై చేసిన ఫుడ్ను తింటుండగా మాంసం ముక్క రుచిలో తేడా అనిపించడంతో అందులో చిన్న ఎలుక కనిపించింది.
దీంతో రెస్టారెంట్ మేనేజర్ను వారు ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదు. మేనేజర్ తీరుపై ఆగ్రహంతో వారు బాంద్రా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా బాంద్రా పోలీసులు రెస్టారెంట్ మేనేజర్, చెఫ్ వివియన్ అల్బర్ట్ శికవర్, చికెన్ సప్లయర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Eiffel tower | తాగిన మత్తులో రాత్రంతా ఈఫిల్ టవర్పైనే.. ఇద్దరు అమెరికన్ టూరిస్టుల అరెస్ట్