కోల్కతా: సందేశ్ఖాలీ హింసను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కామెంట్కు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దీటుగా స్పందించారు. ప్రధాని ఆరోపించినట్టు కాకుండా మహిళలకు బెంగాల్ ఎంతో సురక్షితమని దీదీ పేర్కొన్నారు. కోల్కతాలో మహిళా మద్దతుదారులతో ఆమె గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు.
సందేశ్ఖాలీ గురించి బీజేపీ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నదని ఆమె ఆరోపించారు. బెంగాల్లో మహిళల భద్రత గురించి దుష్ప్రచారం చేస్తున్న బీజేపీ వాళ్లు వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో మహిళలపై జరుగుతున్న హింసపై ఎందుకు మౌనం దాలుస్తున్నారని మమత ప్రశ్నించారు. బీజేపీలో చేరిన హైకోర్టు మాజీ జడ్జి కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ గురువారం బీజేపీలో చేరారు. బీజేపీలో జడ్జి చేరికపై తృణమూల్ విమర్శలు గుప్పించింది.