ఓ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ, జూలై 24: తండ్రులకు కూతుళ్లు బరువు కాదని, అలా ఎప్పుడూ అనుకోవద్దని ఓ తండ్రికి సుప్రీం కోర్టు హితవు పలికింది. ఓ మహిళకు తన తండ్రి నుంచి నెలవారీ ఖర్చులు (భరణం) ఇప్పించాలన్న కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది. ఆడవాళ్లు భారమని తండ్రి తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. దీంతో స్పందించిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం కూతుళ్లు భారం కాదంటూ వ్యాఖ్యానించింది.
2018 ఏప్రిల్ నుంచి నెలకు తనకు చెల్లించాల్సిన రూ.8 వేలు, తన తల్లికి చెల్లించాల్సిన రూ.400 ఇవ్వట్లేదని అక్టోబర్ 2018లో కోర్టుకు నివేదించారు. దీంతో అతడి భార్య, కూతురుకు రెండు వారాల్లో రూ.2.5 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. తిరిగి మేలో విచారణ సమయానికి ఆ వ్యక్తి భార్య మృతిచెందినట్లు తెలిపారు. దీంతో ఆగస్టు 8లోగా కూతురుకు రూ.50 వేలు చెల్లించాలని తండ్రికి సూచించింది.