భోపాల్: దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేసింది. ఇప్పుడు వైరస్ ప్రభావం కొంత మేరకు తగ్గినా ఇప్పటికే దేశంలో 4 లక్షల మందికిపైగా ఆ మహమ్మారికి బలయ్యారు. అందులో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. తన కూతురు పెండ్లిలో అల్లుడికి కట్నంగా రెండు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందజేశాడు.
ఏకంగా రూ.1.40 లక్షలు ఖర్చు చేసి వివాహ వేదికపైనే కూతురు, అల్లుడి చేతికి వాటిని అందజేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉజ్జయినికి చెందిన సుధీర్ గోయల్ అనే వ్యక్తి స్థానికంగా సేవాధామ్ పేరుతో ఒక ఆశ్రమాన్ని స్థాపించి నడుపుతున్నారు. ఆ ఆశ్రమం ద్వారా అయన అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. అందుకే తన కూతురు వివాహ వేడుకను కూడా సేవా కార్యక్రమానికి వేదికగా మార్చాలని భావించిన అయన.. వినూత్న రీతిలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అల్లుడికి వరకట్నంగా ఇచ్చారు.
సుధీర్ గోయల్ నుంచి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కట్నంగా అందుకున్న వధూవరులు.. వాటిని అవసరమైన బాధితులకు ఉచితంగా అందిస్తామని పెండ్లి మంటపంలోనే ప్రతిజ్ఞ చేశారు. దీనిపై సుధీర్ గోయల్ మాట్లాడుతూ తాను తన అల్లుడికి మొత్తం ఎనిమిది హామీలు ఇచ్చానని, అందులో రెండు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఇస్తానన్నది కూడా ఒకటని చెప్పారు. ఆ మేరకు పెండ్లి వేదికపైనే తాను తన అల్లుడికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందజేశానని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కీలక నేతలతో ప్రధాని భేటీ రద్దు..!
ఇంటర్నెట్ తెచ్చిన తంటా.. చెట్టుపై నుంచి ఉపాధ్యాయుడి బోధన..!
చేపల కోసం వల వేస్తే కొండచిలువ చిక్కింది..!
అత్యంత అరుదు: ప్రత్యేక విమానంలో భారత్కు కిడ్నీ పేషెంట్..!
మాదీ అమీర్ఖాన్, కిరణ్రావు బంధం లాంటిదే..!
పేక మేడలా కూలి నదిలో మునిగిన ఇల్లు.. వీడియో