న్యూఢిల్లీ, మార్చి 17: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) ప్రధాన కార్యదర్శిగా కర్ణాటకకు చెందిన దత్తాత్రేయ హోసబళె తిరిగి ఎన్నికయ్యారు. అఖిల భారతీయ ప్రతినిధి సభ(ఏబీపీఎస్) సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది.
దీంతో హోసబళె 2027 వరకు మరో మూడేండ్ల పాటు ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఏబీపీఎస్ సమావేశాలకు ఆరెస్సెస్ అనుబంధ సంఘాలకు చెందిన 1,500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.