Dattatreya Hosabale | ఆర్ఎస్ఎస్ మరోసారి దత్తాత్రేయ హోసబలేను సర్ కార్యవాహగా ఎన్నుకున్నది. ఆయన 2027 వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. 2021 నుంచి హోసబలే సర్ కార్యవాహ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నగర్పూర్లో జరిగిన ప్రతినిధుల సభలో సంఘ్ ప్రతినిధుల సభ మరోసారి దత్తాత్రేయను మరో మూడేళ్లకు సర్ కార్యవాహగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. 2021కి ముందు భయ్యాజీ జోషి సర్ కార్యవాహగా బాధ్యతలు నిర్వర్తించారు.
ప్రతినిధుల సభలో దత్తాత్రేయ హోసబలే మాట్లాడుతూ సమాజంలో సంఘ్ ప్రభావం పెరుగుతోందన్నారు. రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా నిర్వహించిన ‘అక్షితల పంపిణీ’ని ప్రజలు స్వాగతించిన తీరును దేశ వాతావరణాన్ని చూపుతుందన్నారు. రామ మందిరం భారతదేశ నాగరికతకు, సంస్కృతికి చిహ్నమన్న ఆయన.. శ్రీరాముడు దేశం నాగరికత గుర్తింపని.. ఇది పలుసార్లు రుజువైందన్నారు. తాజాగా జనవరి 22 న మరోసారి నిరూపితమైందన్నారు. ఆర్ఎస్ఎస్, దాని సిద్ధాంతకర్తలు దాదాపు 20కోట్ల గృహాలను కేవలం 15రోజుల్లోనే సంప్రదించారని.. ఇది దేశ చరిత్రలోనే రికార్డన్నారు.
దత్తాత్రేయ హోసబాలే కర్ణాటకలోని షిమోగాకు చెందినవారు. డిసెంబర్ 1, 1955న జన్మించిన హోసబలే కేవలం 13 సంవత్సరాల వయస్సులో 1968లో ఆర్ఎస్ఎస్లో చేరారు. 1972లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చేరారు. హోసబాలే బెంగుళూరు విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. దత్తాత్రేయ హోసబలే ఏబీవీపీలో వివిధ హోదాల్లో పని చేశారు. 2002-03లో సంఘ్ ఆల్ ఇండియా కో-ఇంటెలెక్చువల్ హెడ్గా నియామకమయ్యారు. 2009 నుంచి కో చైర్మన్గా సేవలందించారు. ఆయనకు మాతృభాష కన్నడతో పాటు, ఇంగ్లీష్, తమిళం, మరాఠీ, హిందీ, సంస్కృతంతో సహా అనేక భాషలలో పరిజ్ఞానం ఉన్నది. 14 నెలల పాటు మిసా ఖైదీగా ఉన్న దత్తాత్రేయ హోసబాలే.. 1975-77లో జేపీ ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నారు. సుమారు రెండున్నర సంవత్సరాలు ‘మీసా’ కింద జైలులో ఉన్నారు.