బెంగళూరు, మార్చి 15: రాజ్యసభ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు వేయాలని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బెంగళూరులో ఉన్న ఒడిశా ఎమ్మెల్యేలకు రూ.5 కోట్ల చొప్పున ఇవ్వడానికి ప్రయత్నించారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు.
ఇది కచ్చితంగా బీజేపీ నిర్వహించిన ఆపరేషన్ లోటస్యేనని ఆయన విమర్శించారు. ఈ ఉదంతంలో లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. క్రాస్ ఓటింగ్ కోసం నేతలను ప్రలోభ పెట్టడానికే వచ్చామని వారు అంగీకరించారని డీకే వివరించారు.