న్యూఢిల్లీ, జూన్ 1: గతేడాది లాక్డౌన్ సందర్భంగా తన తండ్రిని సైకిల్పై కూర్చొపెట్టుకొని గురుగ్రామ్ నుంచి బీహార్కు సుమారు 1,200 కిలోమీటర్లు ప్రయాణించిన జ్యోతి కుమారి ఇంట విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఆమె తండ్రి మోహన్ పాశ్వాన్ గుండెపోటుతో మరణించారు. లాక్డౌన్ కారణంగా ఓ వైపు చేతిలో డబ్బులు లేకపోవడం.. మరోవైపు గురుగ్రామ్లో ఉండలేకపోవడంతో ఎలాగైనా బీహార్లోని సొంతూరుకు వెళ్లాలనుకున్న కుమారి తన తండ్రిని సైకిల్పై కూర్చొపెట్టుకొని బయలుదేరి 12 రోజుల తర్వాత సొంతూరుకు చేరుకున్నారు. సరిగ్గా ఏడాది తర్వాత ఇప్పుడు ఆమె తండ్రి గుండెపోటుతో మరణించడంతో కుమారి ఇంట విషాదం నెలకొంది.