Cybercrimes in Pandemic | దేశంలో సైబర్ నేరాలో విపరీతంగా పెరిగాయని భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ అన్నారు. ముఖ్యంగా కరోనా టైంలో ఈ నేరాల్లో విపరీతమైన పెరుగుదల కనిపించిందని ఆయన చెప్పారు. ‘కరోనా సమయంలో సైబర్ నేరాలు 500 శాతం పెరిగాయి. ఇప్పుడు మనం డ్రోన్లు, ర్యాన్సమ్వేర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలు వంటి ప్రమాదాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వీటిలో దేశం, రాష్ట్రాల పాత్రను కూడా పరిగణించాలి’ అని రావత్ తెలిపారు.
హ్యాకింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ బ్రీఫింగ్ ‘కకాన్’ (C0c0n) 14వ సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవ ఉపన్యాసం ఇచ్చిన ఆయన సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.