WhatsApp | న్యూఢిల్లీ, డిసెంబర్ 25: సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా వాట్సాప్లోని స్క్రీన్ షేరింగ్ సదుపాయాన్ని ఇందుకోసం వాడుతున్నారు. ఇందులో రియల్ టైమ్లో ఫోన్ స్క్రీన్ షేర్ చేసేలా స్కామర్లు యూజర్లను మభ్య పెడతారు. అత్యవసరం ఉన్నదని, ఫోన్ సంబంధిత సమస్యల్లో సాయం చేస్తామని చెప్తూ వారు ఈ మోసాలకు పాల్పడతారు. యూజర్లు స్క్రీన్ షేర్ చేయడం ప్రారంభించగానే వారికి తెలియకుండానే వారి స్క్రీన్ మీద జరిగే ప్రతిదీ రియల్ టైమ్లో చూడటానికి స్కామర్లకు అవకాశం లభిస్తుంది. దీంతో కేటుగాళ్లు ఆ సమయంలో యూజర్లు చూసే వాట్సాప్ సందేశాలే కాకుండా బ్యాంకు ఖాతాల ఓటీపీల వంటి సున్నిత సమాచారం, సోషల్ మీడియా ఇతర ముఖ్యమైన సమాచారాన్ని కూడా చూడగలుగుతారు. ఈ సమాచారం సాయంతో బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టడానికి ఓటీపీలను దొంగిలించడం, యూజర్ సోషల్ మీడియా ఖాతాల పాస్వర్డ్లు మార్చడం, భవిష్యత్తు ట్రాకింగ్ కోసం మాల్వేర్ అమర్చడం వంటివి చేస్తారు.
జాగ్రత్తగా ఉండటం ఎలా?