చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో టీవీకే పార్టీకి మరింత బలం చేకూరింది. ఆ పార్టీ ముఖ్యనేత విజయ్ .. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సీవీ షణ్ముగం నేతృత్వంలోని అన్నాడీఎంకే(AIADMK) వర్గం .. టీవీకేకు తమ మద్దతును ప్రకటించింది. దీంతో విజయ్ సర్కారు మరింత పటిష్టమైంది. అన్నాడీఎంకే పార్టీ గడిచిన కొన్ని దశాబ్ధాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు షణ్ముగం చెప్పారు. మూడు సార్లు డీఎంకే, ఓసారి టీవీకే చేతిలో ఓడిందన్నారు. పార్టీని పునర్ నిర్మించాల్సిన అవసరం ఉందని, అన్నాడీఎంకే భవిష్యత్తుపై సమాలోచనలు చేయాలని ఇటీవల మీడియాతో తెలిపారు.
టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని, డీఎంకేకు వ్యతిరేకంగా తమ పార్టీని స్థాపించామని, 53 ఏళ్లుగా డీఎంకేకు వ్యతిరేకంగా తాము రాజకీయం చేశామని, డీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా చేశౄమని, కానీ మెజారిటీ సభ్యులు దాన్ని తిరస్కరించారని, డీఎంకేతో కలిసి పనిచేస్తే, అన్నాడీఎంకే సమసిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయని, ప్రస్తుత దశలో తమకు ఎటువంటి కూటమి లేదని, ఇప్పుడు పార్టీ పునర్ నిర్మాణంపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నామని, ఈ నేపథ్యంలో టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు షణ్ముగం తెలిపారు. కానీ పార్టీని చీల్చాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు.
అయితే విజయ్తో పొత్తు పెట్టుకునేందుకు అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ సీఎం పళనిస్వామి వ్యతిరేకించారు. తాజా ఎన్నికల్లో అన్నాడీఎంకేకు 47 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే.