పాట్నా, సెప్టెంబర్ 15: బీహార్కు చెందిన రంజిత్ దాస్ బ్యాంకు ఖాతాలో ఇటీవల రూ.5.50 లక్షలు పడ్డాయి. వెంటనే విత్ డ్రా చేసేశాడు. తప్పు తెలుసుకొన్న బ్యాంకు అధికారులు నోటీసులు పంపారు. పొరపాటున ఖాతాలో జమ చేశామని, డబ్బును తిరిగి బ్యాంకుకు చెల్లించాలని కోరారు. కానీ రంజిత్ ససేమిరా అన్నాడు. ‘2014లో ఎన్నికల సమయంలో మోదీ రూ.15లక్షలు ఇస్తా అన్నారు. ఇది మొదటి ఇన్స్టాల్మెంట్ కావచ్చు. డబ్బు తిరిగి ఇచ్చేదే లేదు’ అని మొండికేశాడు. బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా రంజిత్ డబ్బు తిరిగివ్వలేదు. దీంతో అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు.