CUET UG| న్యూఢిల్లీ: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్- అండర్గ్రాడ్యుయేట్ (సీయూఈటీ- యూజీ) ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. అభ్యర్థులు cuet.samarth.ac.in. వెబ్సైట్లో తమ ఫలితాలను చూడొచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. 22 వేల మందికిపైగా విద్యార్థులు 100 పర్సెంటైల్ సాధించారని తెలిపింది. పరీక్ష నిర్వహించడం వరకే తమ పాత్ర పరిమితమని, మెరిట్ లిస్ట్ను యూనివర్సిటీలే రూపొందిస్తాయని పేర్కొన్నది. సీయూఈటీ పరీక్షను మే 21- జూన్ 23 మధ్య నిర్వహించారు. 11.11 లక్షల మందికిపైగా పరీక్షకు హాజరయ్యారు.